
* ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు కేసీఆర్ కోసం పనిచేశారు
* కేసీఆర్ ప్రముఖులందరీ ఫోన్లు ట్యాపింగ్ చేయించారు
* కాంగ్రెస్,బీఆర్ ఎస్ మధ్య లోపాయకారీ ఒప్పందం
* మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ ః ఎస్ బీ ఐ మాజీ చీఫ్ కేసీఆర్ ఆదేశాలతో అందరి ఫోన్లు ట్యాప్ చేశారని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఫక్షన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ కు వాంగ్మూలం ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభాకర్ రావు ఐపీఎస్ అధికారి కాదు..అయినా ఆయనను అక్కమంగా ఎస్బీఐ చీఫ్గా నియమించారు. గతంలో ఇంటిలిఎన్స్ వ్యవస్థ మొత్తం కేసీఆర్ చేతిలో ఉండేదని ఈటెల అన్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి బాధితుడిని తనేనంటూ ఈటల ఆరోపించారు. తన కుటుంబ సభ్యులు, డ్రైవర్లు, గన్మెన్లు ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికతో పాటు అంతకుముందు, తర్వాత కూడా ఫోన్ ట్యాపింగ్కి గురైనట్లు సిట్ గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు నత్తనడకన నడుస్తోందని ఈటల రాజేందర్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కును ఆటంకం కలిగించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. మునుగోడు బై ఎలక్షన్లో ఎక్కడ ఉంటున్నాం.. ఎవరితో మాట్లాడుతున్నాం, బీజేపీ ప్రణాళికలను కూడా పూర్తిగా వినేవారని తెలిపారు. ఎన్నికల్లో గెలిచే దమ్ములేకే కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంపై రేవంత్ ప్రభుత్వం విచారణ కమిటీ వేసింది కానీ దర్యాప్తు వేగంగా జరగడం లేదని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
రెండు ఫోన్లూ ట్యాప్ చేశారు : ప్రేమేందర్ రెడ్డి
తన రెండు ఫోన్లు ఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేశారని సిట్ అధికారులకు బీజేపీ సీనియర్ నేత ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.బీజేపీని దెబ్బ తీయడానికే ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్పై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులు వేల సంఖ్యలో ఉన్నారని …కానీ కొద్ది మందిని మాత్రమే సాక్షులుగా పిలుస్తున్నారని ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ చాలా చోట్ల ఓడిపోయిందని ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు.
…………………………………………………..