
* రాజకీయాలకతీతంగా బోనాలు
*స్థానికుల సహకారం ఎంతో అవసరం
* బోనాల ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి పొన్నం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: చారిత్రాత్మకమైన ఉజ్జయిని బోనాలను విజయవంతం చేయాలని
దాని కోసం స్థానికుల సహకారం తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
బోనాల నిర్వహణపై మంత్రి పొన్నం సమీక్షా సమావేశం నిర్వహించారు.అమ్మవారి బోనాల ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చారిత్రాత్మకమైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు రాజకీయాలకు అతీతంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం పక్షాన ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా స్థానికుల సహకారం లేకపోతే విజయవంతం కాదన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆలయం లోపల కేబుల్ వైర్లు కొత్తవి వేసి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలన్నారు. భారీ కెడింగ్ జాలి ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.హైదరాబాద్ మొత్తం ఒకేసారి పండుగ జరిగితే కొంత ఇబ్బంది ఉంటుందని.. కానీ ఒక్కో వారం ఒక్కో ఆలయంలో ఉంటుందని, భద్రత విషయంలో పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారుఉజ్జయిని మహంకాళి బోనాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలని తెలిపారు. డెక్కన్ మానవ సేవ సమితి , ఇతర సంస్థలు ఇక్కడ చాలా సేవ కార్యక్రమాలు చేస్తున్నాయన్నారు. అందరూ వారి సహకారం అందించి ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తలసాని, జిల్లా కలెక్టర్ హరిచందన, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత పాల్గొన్నారు.
………………………………………………………