
* మళ్లీ రాష్ట్రంలో వచ్చేది మన ప్రభుత్వమే..
* స్టేషన్ ఘనపూర్లో ఉప ఎన్నిక రావడం ఖాయం
* వరంగల్ వెస్ట్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: కేసీఆర్ విలువ రేవంత్ ఉంటేనే తెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణభవన్లో వరంగల్ వెస్ట్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం మనం సంధికాలంలో ఉన్నాం.. ప్రతిపక్ష పాత్ర మనకు కొత్త.. ఒక్క జిల్లా కమిటీలో మనం అనుకుంటే 8 వందల మందికి పదవులు ఇచ్చుకోవచ్చు. డీఎంకే పార్టీ 76 ఏళ్లుగా తమిళనాడులో రాజకీయాలు శాసిస్తోంది. 24 ఏళ్ల పార్టీ మనది. ఇంకా వందేళ్లు ఉండాలంటే మనం మరింత ధృడంగా తయారు కావాలి. వచ్చే మన ప్రభుత్వంలో వినయ్భాస్కర్ మంత్రి అవుతారు.. ప్రజలకు అందుబాటులో ఉండే వినయ్భాస్కర్ ఓడిపోవటం ఆశ్చర్యానికి గురిచేసిందని.. మనం చేసింది చెప్పుకోలేదు. కానీ వాళ్లు చేయని దానికి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. దేశంలో అత్యధికంగా జీతాలు ఇచ్చినప్పటికీ ఉద్యోగులు మనకు దూరమయ్యారని.. అసలు ముఖ్యమంత్రిని అవుతానని రేవంత్ రెడ్డి కూడా అనుకోలేదని… ఈ విషయాన్ని ఆయన దోస్తులే తనకు చెప్పారన్నారు. కొంతమంది పార్టీ నుంచి పోతే పోనివ్వాలని.. మన వాళ్ల ఇళ్ల చుట్టు తిరిగి సిగ్గు లేకుండా కండువాలు కప్పి చేర్చుకున్నది ముఖ్యమంత్రి కాదా అని హెద్దేవా చేశారు. స్టేషన్ ఘన్పూర్లో బరాబర్ ఉపఎన్నిక వస్తది. తప్పకుండా మనమే గెలుస్తాం. 9 నెలలుగా రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగా బీజేపీ ఉందని ఆరోపించారు. హైడ్రా అనే హైడ్రామా వరంగల్లో కూడా మొదలైతది అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో విచక్షణా రహితంగా నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తున్న వైనంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. హైడ్రా కూల్చి వేతలతో ప్రభుత్వం అనాగరిక చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. చిన్న పిల్లలు పుస్తకాలు తీసుకుంటాం అంటే కూడా సమయం ఇవ్వకుండా అధికారులు మెడలు పట్టి బైటికి నెట్టేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. చిన్న పిల్లల కళ్లముందే వాళ్ల తల్లిదండ్రులు పెట్రోల్ పోసుకుంటే.. వేదశ్రీ అనే చిన్న పాప ఆ బాధను చెప్తుంటే మనసున్న ప్రతి ఒక్కరిని ఆ సంఘటన కలిచివేసిందన్నారు. కస్తూరిబాయి అనే మహిళ చెప్పుల దుకాణాన్ని బుల్డోజర్తో తీసి పారవేయటం అనేది మానవత్వం ఉన్న సర్కారు చేయాల్సిన పనేనా? అని ప్రశ్నించారు. సామాన్లు తీసుకుంటా అంటే కనీసం గర్భిణిలకు కూడా సమయం ఇవ్వారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక్కటే అడుగుతున్న. ఈ ప్రభుత్వా నికి కనీసం మానవత్వం లేదా? అని సూటిగా నిలదీశారు. హైడ్రా బాధితులకు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా తెలంగాణ భవన్కు రండి. న్యాయపరంగా, విూకు మేము అండగా నిలుస్తం. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, లీగల్ సెల్ విూకు పూర్తి అండగా నిలుస్తుందని హైడ్రా బాధితులకు భరోసా నిచ్చారు.
…………………………