
* సూర్యాపేట జిల్లాలో విషాదం
ఆకేరు న్యూస్, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొత్త కొండాపురం(Kotha kondapuram)లో విషాదం చోటుచేసుకుంది. బావిలో దూకి తల్లి వీరమ్మ, కుమారుడు నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల క్రితం వీరమ్మ అన్న నాగేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందారు. ఇక తమ బాగోగులు చూసేవారు ఎవరూ లేరని మనస్తాపం చెందుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
………………………………………………….