
ఆకేరు న్యూస్, డెస్క్ : బంధువుల ఇంట పెళ్లి వేడుకకు హుషారుగా బయలుదేరారు. అక్కడి ఆడి పాడి సరదాగా గడిపారు. వివాహ తంతు ముగిశాక తిరుగు ప్రయాణంలో అంతులేని విషాదం చోటుచేసుకుంది. వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో 9 మంది మరణించారు. ఈ ఘటన హర్యానాలోని (Haryana) ఫతేహాబాద్ జిల్లాలో జరిగింది. 14 మందితో కూడిన బృందం పంజాబ్లోని ఫజిల్కాలో జరిగిన వివాహానికి హాజరయ్యారు. క్రూజర్లో తమ స్వస్థలాలకు తిరుగుపయణమయ్యారు. ఈ క్రమంలో ఫతేహాబాద్లోని భాఖడా కాలువ దాటుతుండగా అదుపుతప్పిన జీపు బ్రిడ్జిపై నుంచి నీళ్లలో పడిపోయింది. దీంతో 9 మంది మంది చనిపోయారు. మరో ముగ్గురు గల్లంతవగా, ఇద్దరు సజీవంగా ఉన్నారని జిల్లా సబ్కలెక్టర్ జగదీశ్ చంద్ర చెప్పారు.
…………………………………………………………….