* రైల్వేస్టేషన్లలో హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు
ఆకేరు న్యూస్, డెస్క్ : మొంథా తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోనే మిగతా ప్రాంతవాసులపైనా ప్రభావం చూపుతోంది. పలు రైళ్లు, విమాన సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తుఫాన్ కారణంగా రైల్వే శాఖ ఇప్పటికే రైలు సర్వీసులను రద్దు చేసింది. అంతేకాకుండా, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం నుంచి నడిచే దాదాపు 100 మేర విమాన సర్వీసులు రద్దయ్యాయి. రైళ్ల రాకపోకలపై ప్రధాన రైల్వేస్టేషన్లలో దక్షిణ మధ్య రైల్వే శాఖ హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేసింది. విజయవాడ డివిజన్లోని ప్రధాన రైల్వేస్టేషన్లలో హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. రిజర్వేషన్ చేసుకున్న వారికి 24 గంటలు రీఫండ్ ఇవ్వటానికి వీలుగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల కోసం రైల్వే హెల్ప్డెస్క్ల నంబర్లు ఏర్పాటు చేసింది.
హెల్ప్ డెస్క్ నెంబర్లు..
రాజమండ్రి : 83319 87657…సామర్లకోట : 73823 83188…తుని : 78159 09479…అనకాపల్లి : 75693 05669, భీమవరం : 78159 09402…గుడివాడ : 78159 09462…విజయవాడ : 0866 2575167…గూడూరు : 08624 250795, నెల్లూరు : 90633 47961…ఒంగోలు : 78159 09489…బాపట్ల : 78159 09329….తెనాలి : 78159 09463…
ఏలూరు : 75693 05268
………………………………………………………..
