
* గోదావరి పుష్కరాళ్లపై చిన్నచూపు
* గత ప్రభుత్వం వరంగల్ ను పట్టించుకోలేదు
* బీఆర్ ఎస్ హయాంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు
* నిధుల కేటాయింపుపై కిషన్ రెడ్డికి లేఖ
* అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
ఆకేరున్యూస్, హనుమకొండ : కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలను సమానంగా చూడడం లేదని తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లోఆమె మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారదాదేవితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధుల కేటాయింపు విషయంలో తెలంగాణను చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. గోదావరి పుష్కరాల కు నిధుల కేటాయింపు విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆమె అన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేక రాస్తానని ఆమె అన్నారు. బీఆర్ ఎస్ హయాంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పనికూడా జరుగలేదని ఆమె అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తట్టెడు మట్టి కూడా పోయలేదని ఆమె మండిపడ్డారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కొండా సురేఖ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు అందజేశారు. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని కొండా సురేఖ అన్నారు.
……………………………………..