
* కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
* పుష్కర స్నానమాచరించిన బండి సంజయ్ దంపతులు
ఆకేరున్యూస్, కాళేశ్వరం: త్రిలింగ క్షేత్రంగా ప్రఖ్యాతులు గడిరచిన కాళేశ్వర క్షేత్రాన్నిఅద్బుతమైన అధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం సరస్వతీ పుష్కరాల సందర్బంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వర క్షేత్రంలోని గోదావరినదిలో బండి సంజయ్ దంపతులు పుష్కర స్నానమాచరించి ముక్తేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంభమేళాలో 50 కోట్ల మంది భక్తులకు అద్బుతమైన ఆతిధ్యమిచ్చామని తెలిపారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు రూ.35 కోట్లు మాత్రమే కేటాయించారని ఆ నిధులు సరిపోవని ఇంకొన్ని నిధులు కేటాయించాలన్నారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలొ పుష్కర స్నానం ఆచరించడం చాలా సంతోషంగా ఉందని, గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమని, 12 ఏండ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు హాజరై స్నానమాచరించడం ఆనందంగా ఉందని అన్నారు. దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని, వారి కష్టాలన్నీ తొలగిపోవాలని, నరేంద్రమోదీ నాయకత్వంలో దేశానికి మరింతగా సేవలందించేలా దీవించాలని ఆ స్వామివారిని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు. సరస్వతి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం 35 కోట్లు మాత్రమే కేటాయించినట్లు తెలిపారు. ఉత్తర ప్రదేశ్ లో నిర్వహించిన కుంభమేళా సందర్భంగా 50 కోట్ల మంది భక్తులకు అద్బుతమైన ఆతిథ్యం ఇచ్చామని అన్నారు. పుష్కర స్నానానికి వచ్చే భక్తులందరి కోర్కెలు తొలగిపోవాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానని అన్నారు. కాళేశ్వరం చాలా పవర్ ఫుల్ ప్లేస్ అని తెలిపారు. కాళేశ్వరంను అద్బుతమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాని తెలిపారు.అంతకు ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ సతీమణి బండి అపర్ణలకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పోలీస్ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య బండి సంజయ్ దంపతులు సరస్వతి నదీమ తల్లి పుష్కర స్నానాన్నిఆచరించారు. అక్కడి నుండి నేరుగా సరస్వతి మాతను, శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి దంపతులకు పూజారులు ప్రత్యేక ఆశీర్వచనం అందించారు.
……………………………………………………