ఆకేరు న్యూస్, తిరుపతి : టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం నవంబర్ 7వ తేదీ శుక్రవారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ కు ఫోన్ ద్వారా నేరుగా చెప్పవచ్చు. ఇందుకు భక్తులు 0877-2263261. ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంటుంది.
…………………………………………………………
