
* కసరత్తు చేస్తున్న భారతీయ రైల్వే శాఖ
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందేభారత్ రైళ్లను ప్రవేశపెడుతున్నది. ఇప్పటికే పలుమార్గాల్లో సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తుంది. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ తొలి వందే భారత్ స్లీపర్ ముంబయి- అహ్మదాబాద్ మార్గంలో 540 కిలోవిూటర్ల దూరం ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించింది. 16 కోచ్లతో రైలు పరుగులు తీసింది. త్వరలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తుంది. ట్రయల్ రన్కు సంబంధించిన డేటాను విశ్లేషించిన అనంతరంధ్రువీకరణ పత్రం జారీ చేయనుంది. ఈ ఏడాది జనవరి తొలివారం రైలు కోటాలో 30-40 కిలోవిూటర్ల స్వల్ప దూరంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సమయంలో రైలు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుని వెళ్లింది. వందేభారత్ స్లీపర్ రైళ్లు రాబోయే కాలంలో రాత్రి ప్రయాణాన్ని పునర్నిర్వహించబోతున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రోటోటైప్ విజయవంతమైన ట్రయల్ రన్ పూర్తి చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది మరో తొమ్మిది వందే భారత్ ట్రైన్ సెట్స్ను ఉత్పత్తి చేయాలని రైల్వేశాఖ భావిస్తుంది. ఏప్రిల్, డిసెంబర్ మధ్య ఐసీఎఫ్ డెలివరీ చేయనున్నది. ఈ రైలులో మూడు కేటగిరిలు అందుబాటులో ఉంటాయి. ఇందులో ఏపీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏసీ, ఏసీ త్రీ టైర్ అందుబాటులో ఉంటాయి. మొత్తం 1,128 బెర్తులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. గత నెలలో భారతీయ రైల్వేశాఖ 24 వందే భారత్ స్లీపర్ రైలు 50 రేకుల కోసం ఆర్డర్ వచ్చింది. రాబోయే రెండేళ్లలో సిద్ధమయ్యే అవకాశం ఉంది. 2026-27 సంవత్సరంలో 24 సెట్స్ ఉత్పత్తి కానున్నాయి. ఇది రైల్వే టెక్నాలజీలో భారత్ స్వావలంభనను మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
…………………………………….