
* పెట్రోలు బాటిళ్లతో నిరసన
ఆకేరు న్యూస్, సిరిసిల్ల : రాత్రికి రాత్రి అనర్హులకు రేషన్ దుకాణాలు(Ration Shops) కేటాయించారని కొంతమంది వాటర్ ట్యాంకెక్కి నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయం చేయాలంటూ పెట్రోలు బాటిళ్లతో ఆందోళన చేపట్టారు. రేషన్ డీలర్ల(Ration dealers) నియామకల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పాత వారికే రేషన్ డీలర్ షిప్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ స్పందించి మొన్న కేటాయించిన షాపులను రద్దు చేసి తిరిగి ఇవ్వాలన్నారు. సమాచారం అందుకున్న అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
………………………..