
* వెంటనే అప్రమత్తమైన మంత్రి
* అధికారులతో చర్చ.. బంధిస్తామన్న డీఎఫ్ ఓ
ఆకేరు న్యూస్, రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేష్(Minister Durgesh).. వెంటనే అటవీ శాఖ అధికారులతో చర్చించారు. చిరుత కదలికలను గుర్తించామని, బంధించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రికి డీఎఫ్ఓ(DFO) వివరించారు. తక్షణం బంధించేలా చర్యలు చేపట్టి, ప్రజలు భయాందోళనలకు గురికాకుండా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
………………………………….