* భర్త పట్ల మృగాళ్లా మారిన ఇద్దరు భార్యలు
ఆకేరున్యూస్, సూర్యాపేట : భర్తను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. ఇద్దరు భార్యలు కలిసికట్టుగా అతడిని కడతేర్చారు. ఈ దారుణ ఘటన చివ్వెంల మండలం గుర్రంతండాలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండాకు చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండగా.. భర్తపై కక్ష పెంచుకున్న భార్యలు.. అతన్ని గుట్టుచప్పుడు కడతేర్చారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులను అప్రమత్తం చేయగా.. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
……………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
