
* అరెస్ట్ లతో మా నోరు మూయలేరు.
* రేపటి ప్రెస్ మీట్ లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే ల స్కామ్ ల భాగోతం విప్పుతా..
* బెయిల్ మంజూరి అనంతరం మీడియా తో కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్ , హనుమకొండ : మీ పాలిట ఏకే – 47 నవుతా.., అరెస్ట్ లతో మా నోరు మూయలేరు. రేపటి ప్రెస్ మీట్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే ల స్కామ్ ల భాగోతం విప్పుతా నని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సుబేదారి పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు.. అనంతరం కాజీపేట రైల్వే కోర్టు లో హాజరు పరిచారు.
ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత కౌశిక్ రెడ్డి కి కాజీపేట రైల్వే కోర్టు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియా తో మాట్లాడారు. కేసులు పెడితే భయపడి వెనక్కి తగ్గేది లేదు.నా మీద ఎక్స్ టార్షన్ కేసు పెట్టారు .రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్ల దగ్గర 20 శాతం డబ్బులు వసూల్ చేస్తున్నారు.. మంత్రి సీతక్క ములుగు లో ఇసుక దందా చేసి డబ్బులు వసూల్ చేస్తున్నారు.. కడియం శ్రీహరి పేదల భూములు లాక్కుంటున్నాడు, అక్రమంగా క్వారీ నడుపుతున్నాడు..వర్థన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పోస్టింగ్ ల పేరుతో పోలీస్ ల దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు..ఈ పనులను ఎక్స్ టార్షన్ అంటారు..వీళ్లంతా ఎక్స్ టార్షన్ చేస్తూ నా మీద అక్రమంగా కేసు నమోదు చేశారని కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..
మీ భాగోతాలు బయట పెడుతా..:
మా నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో చర్చించి రేపు ( ఆదివారం ) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాను.. ఆధారాలతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే ల అవినీతి ని బయట పెడతానని కౌశిక్ రెడ్డి అన్నారు..నా విడుదల కోసం ప్రయత్నం చేసిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన్నారు..మా లీగల్ టీం తో పాటు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు..
……………………………………………………………………………..