
* ఛత్తీస్గఢ్లో ఘోర విషాదం
ఆకేరు న్యూస్ డెస్క్ : ఛత్తీస్గఢ్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాజ్నందన్గాన్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు 8 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వర్షాల సమయంలో ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.
……………………….