
* తండ్రికి రూపాయలు రెండులక్షల సాయం అందచేత
ఆకేరున్యూస్, హైదరాబాద్: సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పరామర్శించారు. అనంతరం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అతడి తండ్రి భాస్కర్ను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా భాస్కర్ కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని వేణు స్వామి అందజేశారు. శ్రీతేజ్ ఆరోగ్యం కోసం ఈ వారం రోజుల్లో మృత్యుంజయ హోమాన్ని.. అది కూడా తన సొంత ఖర్చులతో నిర్వహిస్తానని ఆయన తెలిపారు.
…………………………………….