Palakurthi Pulse Polio Programme
ఆకేరు న్యూస్, పాలకుర్తి: పోలియో రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని పాలకుర్తి మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ గాదె కిరణ్ పిలుపునిచ్చారు. పాలకుర్తి మండల కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామపంచాయితీ వార్డు సభ్యులతో కలిసి ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. గ్రామంలోని పిల్లలకు ఈ సేవలు అందేలా ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కత్తి దస్తగిరి మామిండ్ల, కవిత శోభన్ బాబు, కమ్మగాని.సుధాకర్ గౌడ్, కమ్మగాని.శ్రీకాంత్ గౌడ్, ఏఎన్ఎం స్రవంతి, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
