
ఆకేరు న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామంలోని రైతులు ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేయాలని నిరసన తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రైతులు ఒంటి కాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మీడియాతో మాట్లాడుతూ రెండు లక్షల రుణమాఫీ కోసం రెండు లక్షల కంటే ఎక్కువ అప్పు ఉన్న రైతులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి బ్యాంకుల్లో లోన్లు కట్టామని, ఇటు రుణమాఫీ కాక పోవడం అటు తీసుకున్న అప్పుకి వడ్డీ కట్టలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ తో పాటు రైతు భరోసా కూడా అందివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
అల్లాపూర్ రవీందర్
గ్రామం : పంగిడిపల్లి
కుటుంబ సభ్యుల పేరు మీద నాలుగు లక్షల యాబై వేల రూపాయల అప్పు తీసుకున్నాము. రెండు లక్షల 50 వేల రూపాయలను బయట వడ్డీకి తీసుకొచ్చి రెండు లక్షల రుణమాఫీ కోసం బ్యాంకులో కట్టడం జరిగింది… అప్పటి నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టు ఎన్నిసార్లు తిరిగిన రుణమాఫీ జరగలేదు, దయచేసి ప్రభుత్వం వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేసి తమను ఆదుకోవాలి
ఆళ్లగడ్డ ప్రమీల
గ్రామం : పంగిడిపల్లి
నా ఇద్దరి కుమారుల పైన నా పైన కలిపి 2 లక్షల లోపు మాత్రమే రుణమాఫీ ఉందని, రుణమాఫీ కోసం
బ్యాంకులో లక్షకు వేయి రూపాయలు చొప్పున వడ్డీ కట్టామని కనీసం తన పేరిటైన లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబంధు లేకపోవడం వల్ల పెట్టుబడి ఎక్కువగా పెట్టలేక పంట దిగుబడి లేక ఇబ్బందులు పడుతున్నాం.
……………………………………………………