
ఆకేరు న్యూస్, స్పోర్ట్స్ డెస్క్ : మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే నాలుగో టెస్టులో భారత్ పరాజయం పాలైంది. 184 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. ఐదు టెస్ట్ ల సిరీస్ లో 2-1 ఆధిక్యంలో ఆస్ట్రేలియా గెలుపు ఆశలను సజీవం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 474 పరుగులు, భారత్ 369 పరుగులు సాధించగా, రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 234, భారత్ 155 పరుగులు సాధించాయి. నాలుగో టెస్ట్లో భారత్ ఓటమితో టీమిండియా రేసు దాదాపు నిష్ర్కమించినట్లే.
…………………………………………….