
* మావోల భారీ బంకర్ ను గుర్తించిన సైన్యం
* ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
ఆకేరున్యూస్ డెస్క్ : ఛత్తీస్గఢ్లోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య వార్ నడుస్తూనే ఉంది. ఒకరిపై మరొకరు ప్రతీకారం తీర్చుకుంటూనే ఉన్నారు. మావోయిస్టుల ఏరివేతకు భద్రతా దళాలు తీవ్రస్థాయిలో కూంబింగ్ చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ (Chathisghar) సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో గురువారం మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగిన విషయం విదితమే. ఈ ఘటనలో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. అనంతరం నారాయాణపూర్ జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ (Ied)పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో సుక్మా- బీజాపూర్ సరిహద్దుల్లో భద్రతా దళాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. సుక్మా- బీజాపూర్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్ (Encounter)నేపథ్యంలో ఆ ప్రాంతంలో సైన్యం తనిఖీలు చేపట్టింది. సుక్మా వద్ద మావోయిస్టులకు సంబంధించిన భారీ బంకర్ను డీఆర్ జీ (DRG) పోలీసులు గుర్తించారు. తుమ్రేల్, తల్పేరు నదుల మధ్య ఉన్న బంకర్లో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు టార్గెట్గా దాడులు చేసేందుకు అధునాతన టెక్నాలజీని ఉపయోగించి బాంబులను మావోయిస్టులు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. బాంబుల తయారీకి గాజు సీసాలను ఉపయోగిస్తున్నట్టు కనుగొన్నారు. మావోయిస్టుల దాడులను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
…………………………………