
* ట్విటర్ వేదికగా భావోద్వేగానికి లోనైన ప్రధాని మోదీ
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన ‘బేటీ బచావో, బేటీ పఢావో’ కార్యక్రమం నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ‘నేటితో బేటీ బచావో, బేటీ పఢావో ఉద్యమానికి పదేళ్లు పూర్తవుతాయి. గత దశాబ్ద కాలంలో ఇది ఒక కీలక పరివర్తన, ప్రజల-ఆధారిత చొరవగా మారిందని.. అన్ని వర్గాల భాగస్వామ్యాన్ని పొందిందని’ ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. దేశంలోని మహిళల హక్కులను కాపాడేందుకు, వారి విద్యకు భరోసా కల్పించేందుకు ఈ ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు.
……………………………………