
* సోయిలేని కాంగ్రెస్ పాలన
* దాడి చేసిన వారిపై కాకుండా బాధితులపై కేసులా
* ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేకుండాపోతుందని, కాంగ్రెస్ గూండాలు హద్దులు దాటుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో దివ్యాంగుడైన ఒక మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదని.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుండగులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. బీఆర్ఎస్కు భయపడి నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. దాడి చేసింది మంత్రి గూండాలు అయితే.. పోలీసులు భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారని ఫైర్ అయ్యారు. తమ నాయకుడు కంచర్ల భూపాల్ రెడ్డి మీద జరిగిన పాశవిక దాడిని ఖండిస్తున్నానన్నారు. బాధ్యులపై కేసులు నమోదు చేయాలని రాష్ట్ర డీజీపీని కోరుతున్నానని కేటీఆర్ ఎక్స్లో పేర్కొన్నారు
……………………………