
* ఐటీ సోదాలపై దిల్ రాజు కీలక వ్యాఖ్యలు
* హైదరాబాద్లో మీడియాతో భేటీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగలేదు కదా అని ప్రముఖ సినీ నిర్మాత, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు (Dil Raju)అన్నారు. ఐటీ సోదాలకు(It Rides) సంబంధించి ఆయన హైదరాబాద్ లో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఐదేళ్లుగా తాము ఎక్కడా పెట్టుబడులు పెట్టలేదన్నారు. ఐటీ అధికారులు అడిగిన వివరాలన్నీ ఇచ్చామన్నారు. సినిమా(Cinima)కు సంబంధించిన వివరాలు అడిగితే ఇచ్చామన్నారు. ఐటీ అధికారులు నిన్న తనతో మాట్లాడారని, కొన్ని పత్రాలు ఇచ్చామని చెప్పారు. వాటిని తనిఖీ చేస్తున్నారన్నారు. నిబంధనల ప్రకారమే.. ఐటీ అధికారులు తమ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపారని దిల్ రాజు చెప్పారు. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదని ఆస్పత్రిలో చేర్చామని, ఇప్పుడు బాగానే ఉన్నారని వెల్లడించారు. అపోహలు సృష్టించి ఏవేవో వార్తలు రాయవద్దని మీడియాను కోకరారు. 18 ఏళ్ల తర్వాత తమ ఇళ్లలో సోదాలు జరిపారన్నారు. 90 శాతం టికెట్లు ఆన్లైన్(Online) లో అమ్ముతున్నామని, ఇక బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వస్తుందని వివరించారు. తమ ఇల్లు, కార్యాలయాల్లో మొత్తం ఉన్న నగదు రూ. 20 లక్షలు మాత్రమేనని, బంగారం కూడా ఎంత ఉండాలో అంతే ఉందన్నారు. అన్నింటికీ అధికారికంగా అధికారులు ధ్రువపత్రాలు ఇచ్చారని దిల్ రాజు వివరించారు.
………………………………………