
* బీహర్కేమో ఎన్నికల బొనాంజానా
* నిర్మలా సీతారామన్ తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలుగు కోడలైనా కాని.. నిర్మలా సీతారామన్ బడ్జెట్లో తెలంగాణపై ప్రేమ చూపలేదని టీపీసీస చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణకు నిర్మలా సీతారామన్ గాడిదగుడ్డు కేటాయించారన్నారు. తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. బడ్జెట్ అనేది కేవలం బీహార్ ఎన్నికల కోసమేనంటూ.. అందుకే బీహార్ నజరాణాలు ప్రకటించారని మహేప్ా కుమార్ గౌడ్ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతుందని.. రాజకీయంగా తెలంగాణను దెబ్బతీయాలని చూస్తుందని తెలిపారు. 50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్రం తెలంగాణ ఒక్క పైసా కూడా ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. త్వరలో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అక్కడ రాజకీయ లబ్దికోసమే బీజేపీ కేంద్ర బ్జడెట్ను ఉపయోగించుకుందని… దేశం మొత్తం ప్రజల నుంచి వసూలు చేసే బ్జడెట్లో అందరికి సమానంగా ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందన్నారు. తెలంగాణ నుంచి 40 వేల కోట్ల రూపాయిలు జీఎస్టీ కేంద్రానికి కడుతున్నామని.. కాని తెలంగాణకు బ్జడెట్ లో నిధులను ఎందుకు కేటాయించలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో వివక్ష చూపడం అన్యాయన్నారు. నిర్మలమ్మ తన ప్రసంగంలో గురజాడ అప్పారావు దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న పదాలను వాడారు.. మరి తెలంగాణ ప్రజలు దేశంలో మనుషులు కారా.. అని నిర్మలమ్మను ప్రశ్నించారు. తెలంగాణకు ఎన్నికల సమయంలో ప్రధాని మంత్రి, బీజేపీ నాయకులు ఇచ్చిన హావిూలను గాలికొదిలేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు కేంద్ర మంత్రులను, ప్రధాన మంత్రిని కలిసి తెలంగాణ కు రావాల్సిన అనేక అంశాలపై విజ్ఞప్తి చేసినా.. బీజేపీ మాత్రం స్వార్థ పూరితంగా వ్యవహరించిందన్నారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు, విభజన హావిూలు, పాలమూరు రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఐటీఐఆర్, బయ్యారం కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం లాంటి అనేక ప్రాజెక్టులు పెండిరగ్ లో ఉన్నా కూడా కనీసం వాటి పేరును కూడా ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కేంద్రం … తెలంగాణ కు అవసరమైన అంశాలలో సహకారాన్ని అందించాలని కోరారు.
……………………………………………………