
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ (Hyderabad) బాలానగర్ పరిధిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. దాసరి సంజీవయ్య కాలనీ(Sanjeevayya Colony)లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఈరోజు తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. మంటల్లో చిక్కుకుని సాయి సత్య శ్రీనివాస్ (30) మృతి చెందారు. రాజమహేంద్ర వరానికి చెందిన శ్రీనివాస్ బాలానగర్లో ఉంటూ పటాన్ చెరు(Patancheru)లోని ఓ రసాయన పరిశ్రమలో పనిచేస్తున్నాడు. మూడు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బందిని మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
…………………………………..