
* రెండూ కలిపి విచారిస్తామన్న ధర్మాసనం
ఆకేరు న్యూస్, డెస్క్ : పార్టీ మారిన ఆరుగురు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (Ktr) దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టు(Suprim Court)లో విచారణ జరిగింది. కేటీఆర్ పిటిషన్పై జస్టిస్ గవాయ్, జస్టస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇదే వ్యవహారంపై గతంలో దాఖలు చేసిన పిటిషన్ ను జతపరిచిన ధర్మాసనం.. ఈ నెల 10న పాత పిటిషన్ తో కలిసి విచారణ జరుపుతామని పేర్కొంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల(Mlas)కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. పోచారం, సంజయ్, మహిపాల్రెడ్డి, అరెకపూడి గాంధీ, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్రెడ్డికి నోటీసులు పంపింది.
………………………………………….