
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ఒక పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చు. 11న నామినేష్ల పరిశీలన, 13న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. 27న పోలింగ్ జరుగనుండగా.. వచ్చేనెల 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
వివరాలు..
నామినేషన్ ప్రక్రియ: ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు
నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 11
నామినేషన్ల ఉపసంహరణకు గడువు: ఫిబ్రవరి 13
పోలింగ్: ఫిబ్రవరి 27 (ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
ఫలితాలు: మార్చి 3
………………………………..