
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఫామ్హౌస్కు సంబంధించి వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. దీంతో న్యాయవాదితో కలిసి వచ్చిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మొయినాబాద్ పోలీసులకు సోమవారం లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. కోడి పందాలు ఆడిరచిన ఫామ్ హౌస్ తనదేనని 2023 వర్రా రమేష్ కుమార్ రెడ్డికి లీజ్కు ఇచ్చినట్లు పోచంపల్లి పేర్కొన్నారు. రమేష్ కుమార్తో పాటు మరొకరి కూడా లీజ్కు ఇచ్చినట్లు వెల్లడిరచారు. లీజ్ పత్రాలను కూడా పోలీసులకు అందజేశారు పోచంపల్లి. లీజ్కు ఇచ్చిన భూమిని ఏపీకి చెందిన వ్యాపారి భూపతి రాజు శివ కుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కోడి పందాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు. కాగా.. భూపతిరాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ అనే వ్యక్తి అదే ఫామ్హౌస్లో రెండు మూడు సార్లు పెద్దఎత్తన కోడిపందాలు, క్యాసినోలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇటీవల మొయినాబాద్ ఫామ్హౌస్లో మరోసారి కోడిపందాలు నిర్వహించాడు గబ్బర్ సింగ్. సంక్రాంతి పండగ తర్వాత మిగిలిన కోళ్లను ఫామ్హౌస్కు తీసుకువచ్చి కోడిపందేలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందులో చాలామంది బిజినెస్మెన్స్, రియల్ఎస్టేట్ వ్యాపారులు కోడిపందాలకు హాజరయ్యారు. దీనిపై పక్కా సమాచారంతో ఎస్వోటీ పోలీసులు ఫామ్హౌస్పై దాడులు చేశారు. అయితే అప్పటికే పలువురు తప్పించుకోగా.. కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న భూపతి రాజు శివకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో మొత్తం 64 మందిని అరెస్టు చేశారు. పందాలకు వినియోగిస్తున్న రూ.30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లు, పందాల కోసం ఉపయోగించే 86 కోళ్లు, కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో 10 మంది తెలంగాణకు చెందిన వారు కాగా.. మిగిలిన వారు అంతా ఏపీ వాసులే. ఈ వ్యవహారంపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో గేమింగ్ చట్టం, జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం కింద కేసు నమోదు అయ్యాయి. అయితే ఈ ఫామ్హౌస్ యజమానిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ ఉండటంతో ఆయనకు నోటీసులు నోలీసులు ఇవ్వగా, పోచంపల్లి శ్రీనివాస్ ఈ మేరకు వివరణ ఇచ్చారు.
………………………………