* ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు చేయాలి
* రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 27న నిర్వహించనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించిన ఏర్పాట్లుపై అన్ని ఆయా జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పోలింగ్ స్లిప్పులు పంపిణీ పూర్తి చేయాలని అన్నారు. పోలింగ్ ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. జిల్లాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటరు పాటించాల్సిన నియమాలు వివరాలు ఏర్పాటు చేయాలన్నారు.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
