
* ఆస్తి రిజిస్ట్రేషన్కు రూ. 10వేలు డిమాండ్
ఆకేరు న్యూస్, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ( Registration Office ) అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం దాడులు (ACB Raids ) నిర్వహించారు. లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ను రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని కవితా కాంప్లెక్స్ రెండో అంస్తులో జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. సోమవారం ఉదయం ఈ కార్యాలయంపై అవినీతి శాఖ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి కి సంబంధించిన ఆస్తి జిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్ శ్రీరామరాజు రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా, అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపడుతున్నారు.
………………………………………….