* పట్టుకున్నోళ్లకు పట్టుకున్నన్ని చేపలు
భద్రాద్రి కొత్తగూడెం, ఆకేరున్యూస్: పల్లెల్లో కనిపిస్తున్న దృశ్యాలు చెరువుల జాతర తలపిస్తోంది.. చెరువుల్లో నీరు అడుగంటుతుండటంతో చేపలు పట్టేందుకు జనం ఎగబడుతున్నారు. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని కర్ణవల్లి పెద్ద చెరువులో చేపల వేటకు జనం ఎగబడ్డారు. చెరువుల్లో చేపలు పట్టే ముందు చుట్టుపక్కల గ్రామాలకు విషయం తెలియజేసి అందరు ఒకేసారి చెరువుల్లో చేపలు పట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే కర్ణవల్లిలోని పెద్ద చెరువులో చేపలు పట్టేందుకు జనం భారీగా తరలివచ్చారు. సుమారు ఐదు ఊర్ల జనం ఒక్కసారిగా చెరువులో దిగడంతో ఆ ప్రాంతం జాతరను తలపించింది. జల పుష్పాల కోసం జనం పోటీ పడ్డారు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా జనం చేపలు పట్టేందుకు ఎగబడడం చేపల జాతరను తలపించింది..
………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
