
* భూముల అమ్మకాల్లో బీఆర్ ఎస్తో కాంగ్రెస్ పోటీ
* కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు తొందరేమీ లేదని ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishanreddy) తెలిపారు. ఎన్నికకు ఇంకో వారం రోజులు పట్టే అవకాశం ఉందని అన్నారు. కేరళ, తమిళనాడు అధ్యక్షులను ప్రకటించారని, జాతీయ అధ్యక్షుడి ప్రతిపాదనల్లో తన పేరు లేదని స్పష్టం చేశారు. తమిళనాడులో ఎన్డీఏ(Nda)ను పునరుద్ధరించినట్లు వివరించారు. నియోజకవర్గాల పునర్విభజనపై ఎక్కడైనా చర్చ జరిగిందా అని ప్రశ్నించారు. తెలంగాణ(Telangana)లోనూ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. భూముల అమ్మకం, మద్యం విక్రయాలు, అప్పులతో కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తోందని విమర్శించారు. భూముల అమ్మకంలో బీఆర్ ఎస్తో కాంగ్రెస్ పోటీ పడుతోందని అన్నారు. హెచ్ సీయూ (HcU) అంశంలో తనపై కేసు పెడితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని కిషన్ రెడ్డి చెప్పారు.
………………………………………