* శ్రీవారికి బంగారు కఠి, వరద హస్తాలు విరాళం
ఆకేరు న్యూస్, తిరుపతి : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి(VENKATESWARA SWAMY) వారికి శుక్రవారం ఉదయం ఓ భక్తుడు భారీగా బంగారు కానుకలు విరాళంగా అందించాడు ఓ భక్తుడు. కోల్కాతాకు చెందిన సంజీవ్ గోయెంకా (SANJIV GOYANKA) రూ.3.63కోట్లు విలువైన 5.267 కేజీల బంగారంతో వజ్రాలు, రత్నాలతో పొదిగిన కఠి, వరద హస్తాలను చేయించి స్వామివారికి సమర్పించారు. ఈ మేరకు తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆభరణాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, బొక్కసం ఇన్ ఛార్జి శ్రీ గురురాజ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
