* ఆందోళన రేకెత్తిస్తున్న కొత్త కేసులు
* కేసులు పెరుగుతుండడంతో కొత్త వ్యాక్సిన్కు ఆమోదం..
ఆకేరున్యూస్: ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆరోగ్య నిపుణుల్లో ఆందోళనను రేకెత్తించాయి. కొన్ని వారాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరగడమే కాకుండా చాలాచోట్ల ఆసుపత్రుల్లో చేరే రోగుల సంఖ్య పెరిగింది. ఈ పెరుగుతున్న కేసులకు కొత్త వేరియంట్ కారణమని ఇప్పటి వరకు నిపుణులు ప్రకటించలేదు. కాగా, వ్యాక్సిన్ రోగనిరోధక శక్తి తగ్గుతోందని, ఫలితంగా వైరస్ ప్రభావం మరోసారి కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా కరోనాకు బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గతంలో ఫ్లూ మాదిరిగానే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని పలు ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. ఆగ్నేయాసియాలోని అనేక ప్రాంతాలలో కోవిడ్-19 కొత్త వేరియంట్ తర్వాత ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వైరస్ మరోసారి వినాశనం కలిగించబోతోందా? కోవిడ్-19 నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి మనమందరం మునుపటిలాగే చర్యలు తీసుకోవాలా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒమిక్రాన్ అసలు వేరియంట్ ప్రస్తుతం కనుమరుగైందని.. ప్రస్తుతం సబ్ వేరియంట్స్ మాత్రమే కనిపిస్తున్నాయన్నారు. ఈ వేరియంట్లు అంత ప్రమాదకరమేమీ కాదని.. కాలక్రమేణా ప్రజల రోగనిరోధక శక్తి బలహీనపడడం వల్ల వైరస్ మరింత సులభంగా వ్యాపిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
……………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
