
* మహిళా సంఘాలను బలోపేతం చేయడమే లక్ష్యం
* మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్ ములుగు : మహిళా సంఘాలను బలోపేతం చేసి వారికి ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి,
గ్రామీణ నీటి సరఫరా, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
గురువారం ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామం ఆశ్రమ జూనియర్ కళాశాల ప్రాంగణం లో కుట్టు మిషన్ ఉచిత శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్, ధ్రువపత్రాలను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ లతో కలసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ చాలా మంది మహిళలు వివిధ రంగాలలో నైపుణ్యం లేని కారణంగా ఉపాధికి దూరంగా ఉంటున్నారని, ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉన్న చోటే ఉపాధి కలకపించడానికి కృషి చేస్తున్నామని అన్నారు ఆ ఉద్దేశంతోకుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫాంలు కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించి దాదాపు 30 కోట్ల రూపాయల లాభం వారికి చేకూర్చడం జరిగినదని తెలిపారు. 15 సం.ల నుండి 60 సం.ల లోపు వయస్సున్న మహిళలు అందరూ తప్పకుండా మహిళా సంఘాలలో చేరాలని మంత్రి కోరారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత కొరకు పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఇందులో భాగంగానే మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ లు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, బస్సులు, సోలార్ విద్యుత్తు ఉత్పత్తి అవకాశాలను అందించడం జరుగుతుందని అన్నారు. మహిళలు ప్రభుత్వ సహకారాన్ని వినియోగించు కొవాలని సూచించారు తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో నడిచేలా మనమంతా ముందడుగు వేద్దామని ఆకాంక్షించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళలను ఆర్థికంగా పరిపుష్టం చేసే ఉద్దేశ్యంతో మంత్రివర్యులు ప్రత్యేక చొరవతో జగ్గన్నపేట గ్రామంలో వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. నైపుణ్య శిక్షణతో ఉపాధి కల్పించినప్పుడు మాత్రమే అది సార్థకం అవుతుంది. ఇలాంటి కార్యక్రమం వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకొని ప్రతిభావంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి నెలవారీ ఆదాయం కూడా చేకూరేలా పరిపూర్ణం చేయడం జరుగుతున్నదని ఇప్పటికే 3 కంపెనీలతో మాట్లాడటం జరిగిందని కలెక్టర్ వివరించారు.
జిల్లా సంక్షేమ అధికారి తుల రవి మాట్లాడుతూ డేటా ప్రో సంస్థ శిక్షణ సహకారంతో గత నెల రోజులుగా గ్రామంలోని అర్హులైన 175 మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ అందించడం జరిగినదని అన్నారు. లబ్దిదారులకు మొదటి విడతగా 75 కుట్టు మిషన్ లను మంత్రి అందచేశారు.
అనంతరం ICDS ములుగు ప్రాజెక్టు CDPO శిరీష ఆధ్వర్యంలో అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమం లో భాగంగా అంగన్వాడీ కేంద్రం లో చేరిన చిన్నారులకు మంత్రి సీతక్క , కలెక్టర్ లు అక్షరాభ్యాసం చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా సంక్షేమాధికారి తుల రవి, డి ఎస్ పి రవీందర్,
ట్రైబల్ వెల్ ఫర్ డీడి పోచం, ఎం పి డి ఓ రామక్రిష్ణ, జిల్లా మహిళా సాధికారతా కేంద్రం (DHEW) DMC రమాదేవి, DCPO J. ఓంకార్, ICDS ములుగు ప్రాజెక్టు పరిధిలోని వివిధ సెక్టార్ల సూపర్వైజర్లు, జిల్లా మహిళా సాధికారతా కేంద్రం, DCPU, CHL, సఖి, డేటాప్రో సంస్థ ప్రతినిధులు మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………………..