
* యువతే టార్గెట్ గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్
* ఆన్లైన్ లో 50 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు
*సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
* నిందితుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు,విద్యార్థులు
ఆకేరున్యూస్, హైదరాబాద్ ః ఆన్ లైన్ యాప్లతో లక్షల కొద్ది అమాయకులు టొకరా వేస్తున్న
సైబర్ నేరగాళ్లను సైబరాబాద్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 సెల్ ఫోన్లు రెండు ల్యాప్ట్యాప్లు బ్యాంక్ పాస్ బుక్కులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. నిందితులకు 10వేల మంది ఫోలోవర్స్ ఉన్నట్లు సైబర్ పోలీసులు తెలిపారు.10 విదేశీ వెబ్ సైట్లను కూడా నిందితులు ప్రమోట్ చేస్తున్నారు.ఈ వ్యవహారం 2019నుంచి నడుస్తోందని పోలీసులు వెల్లడించారు.
……………………………………………….