
ఆకేరు న్యూస్, జనగామ: పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు తప్పుగా నమోదయింది.. దాన్ని సవరించాలని తహసిల్దార్ ను కలిసిన రైతును పైసలు ఇచ్చుకో పేరు మార్చుకో… అంటూ డబ్బులు డిమాండ్ చేశారు… దీంతో సదరు రైతు తహసిల్దార్ కు డబ్బులు ఇస్తూ తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేయడం.. అది సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామానికి చెందిన రైతు తన పాస్ బుక్ లో భూ పట్టా పేరు తప్పుగా నమోదయింది. తప్పును సరి చేసుకోవడానికి రైతు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. తసిల్దార్ రాజారావును పేరు మార్పిడి చేయాలంటూ విన్నవించుకున్నారు దీంతో పైసలిస్తేనే పనిచేస్తానని డిమాండ్ చేశాడు దీంతో రైతు చేసేదేమీ లేక సరే అన్నాడు తన వద్దన్న ఏడు వేల రూపాయలు ఇస్తూ తన సెల్ఫోన్లో వీడియో రికార్డ్ చేశాడు రైతులు దగ్గర నుండి రూ.7000లు తీసుకుంటూ ఇంతేనా ఇంకో రూ.1000లు ఇవ్వు అంటూ డిమాండ్ చేశారు. దీంతో రైతు లేవంటూ సమాధానం చెప్పడం తో తహసీల్దార్ రైతు ఇచ్చిన డబ్బులను లెక్కబెట్టుకుని దాసుకోవడం వీడియోలో కనిపించింది. ఎప్పుడూ ఇది వైరల్ గా మారింది.
……………………………………….