
* కొడుకు ఘాతుకం
* టెక్స్ టైల్ భూముల పరహారమే కారణం
* సంగెం మండలంలో దారుణం
ఆకేరు న్యూస్, వరంగల్ : తల్లి పట్ల కన్న కొడుకే కాల యముడిలా ప్రవర్తించాడు. పెట్రోల్ మీద పోసి నిప్పంటించాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి లో ఈ దారుణం చోటుచేసుకుంది . కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పరిశ్రమకోసం ఈ కుటుంబానికి సంబంధించిన భూములను ప్రభుత్వం సేకరించింది . ఆ భూములకు ప్రభుత్వం ఇచ్చిన పరిహారం డబ్బుల పంపిణీలో చాలా కాలంగా తల్లి ,కొడుకుల మద్య ఘర్షణ జరుగుతోందని గ్రామస్థులు అంటున్నారు.. తల్లీ వినోద ఎంజీఎం ఆస్పత్రి లో చికిత్స పొందుతోంది..
————