
* జననాంగంలో జీడి పోసి పైశాచికానందం
* అక్రమసంబంధం కలిగి ఉందని చిత్రహింసలు
* ఘటన జరిగి ఐదు రోజులైనా పోలీసులకు అందని సమాచారం..!
* ఆలస్యంగా వెలుగు చూసిన వైనం
ఆకేరున్యూస్, హనుమకొండ : యువతిని కట్టేశారు.. వివస్త్రను చేశారు.. జననాంగంలో జీడిని పోశారు.. చిత్రహింసలకు గురి చేశారు. సభ్య సమాజం తలదించుకునే ఈ అమానవీయ సంఘటన హనుమకొండ జిల్లా ధర్మసా గర్ మండలం తాటికాయల గ్రామంలో జరిగింది. ఐదు రోజుల కిందట జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిక్కుడు రమ తన భర్తతో గత ఆరేళ్ళుగా అక్రమ సంబంధం పెట్టుకుని తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని గంగ అనే మ హిళ బంధువులు ఈ దారుణానికి ఒడిగట్టారు. తన భర్తతో పాటు ఆ యువతిని వెతికి పట్టుకొని ఐదు రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకువచ్చి విచక్షణారహితంగా మహిళ బంధువులు దాడి చేశారు. ఇద్దరికీ గుండు గీయించారు. ఆ యువతిని ఓ మంచానికి కట్టేసి వివస్త్రను చేశారు.
జననాంగంలో జీడి రసం..!
ఆ మహిళ జననాంగంలో జీడిరసం పోసి విచక్షణారహితంగా దాడి చేశారు. శరీరంలోని సున్నిత భాగాల్లో జీడి రసం పోస్తే పుండు అవుతుంది. సదరు యువతి తాను ‘తప్పు చేశా ను.. క్షమించండి’ అంటూ బాధిత యు వేడుకున్నా వినకుండా దాడి చేశారు. జన నాంగంలోనుంచి తీవ్ర రక్తస్రావమవుతున్నా వదల్లేదని బాధితులు వాపోయినట్లు తెలిసింది. ఐదు రోజుల క్రితం సంఘటన జరగడంతో బాధితులు ఇద్దరు గ్రామం విడిచి వెళ్ళినట్లుగా సమాచారం.
* పోలీస్ స్టేషన్లో నిందితులు
సమాచారం అందుకున్న ధర్మసాగర్ పోలీసులు తాటికాయల గ్రామానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
———————————