
* హామీలు మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం
* విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడుతున్నారు
* నిరుద్యోగులను దగా చేసిన గాంధీ కుటుంబం
* రేవంత్ సర్కార్ పై ధ్వజమెత్తిన హరీష్ రావు
ఆకేరున్యూస్ హైదరాబాద్ః రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్య హరీష్ రావు అన్నారు. నిరుద్యోగ యువకులు చేపట్టిన చలో సెక్రటేరియట్ కు బీఆర్ ఎస్ మద్దతు కోరుతూ హైదరాబాద్ బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు కలిశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికల మందు కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని విమర్శించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన రేవంత్ సర్కార్ ఇంత వరకూ ఇవ్వలేదన్నారు.
జాబ్ క్యాలెండర్ కాదు దగా క్యాలెండర్
ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీలో జాబ్ విడుదల చేశారని అది జాబ్ క్యాలెండర్ కాదని దగా క్యాలెండర్ అని హరీష్ అన్నారు.2024లో ఎన్పీడీసీఎల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పోలీస్ డిపార్టుమెంటు అన్ని డిపార్ట్ మెంట్లలో ఖాళీలు భర్తీ చేస్తామన్నరనిహరీష్ రావు అన్నరు. మెగా డీఎస్సీతో ఉపాధ్యాయ ఖాళీలు అన్ని భర్తీ చేస్తామన్నారు ఇంత వరకు అది అమలుకు నోచుకోలేదని హరీష్ రావు ధ్వజమెత్తారు.
స్థానికులకే అవకాశం కల్పించాం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జోనల్ ఉద్యోగాల్లో ఇతర ప్రాంతాల వారికి 40 శాతం 30 శాతం రిజర్వేషన్లు ఉండేవని కానీ బీఆర్ ఎస్ ప్రభుత్వం ఇచ్చిన తరువాత స్థానికులకు95 శాతం ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకున్నమన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా స్థానికులకు 95 శాతం ఓద్యోగావకాశాలు కల్పించామని హరిష్ అన్నారు.
రేవంత్ రెడ్డిది గోబెల్స్ ప్రచారం..
బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో అసలు ఉద్యోగాలే ఇవ్వలేదని రేవంత్ ప్రచారం చేస్తున్నారని ఇదంతా అబద్దం అని హరీష్ రావు అన్నారు. మొత్తం లక్షా 60వేల ఉద్యోగాలు బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని హరీష్ గుర్తు చేశారు. పదేళ్ల కాలంలో రెండేళ్లు రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఎదురుచూడగా రెండేళ్లు కరోనాతో ఏ పనిచేయలేని పరిస్థితి ఉందని అన్నారు. అయినా యావరేజ్ గా చూస్త బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఏడాదికి 16 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లేనని హరీష్ అన్నారు. కాంగ్రెస్ ప్రబుత్వం 29 నెలల కాలంలో కేవలం 12వేల ఉద్యోగాలనే భర్తీ చేసిందన్నారు.
నిరుద్యోగులను మోసం చేసిన గాంధీ కుటుంబం
కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ ,ప్రియాంకలు నిరుద్యోగులను మోసం చేశారని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటి ప్రాధాన్యత ఉద్యోగాలు కల్పించడమేనని అశోక్ నగర్ లో నిరుద్యోగులకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని హరీష్ అన్నారు. రాహుల్ ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డిపై ఒత్తడి తెవాలని హరీష్ కోరారు.ప్రయాంక గాంధీ సరూర్ నగర్ ఎన్నికల సభలో ఐదు అంశాలపై హామీ ఇచ్చారని అన్నారు, ప్రయాంక ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రియాంక మరి స్కూటీల పంపిణీ ఎందుకు జరుగలేదో వివరించాలని హరీష్ అన్నారు.ప్రయాంక గాంధీ గాంధీ భవన్లోమ సమీక్ష నిర్వహించి ఇచ్చిన హామీలను ఎందకు అమలు చేయలేదో రేవంత్ను నిలదీయాలని హరీష్ రావు అన్నారు.
శ్వేత పత్రం విడుదల చేయాలి
60 వేల ఉద్యోగాలు ఇచ్చినం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఏయే డిపార్టుమెంటుల్లో ఉద్యోగాలు ఇచ్చారు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎప్పడు భర్తీ చేశారు అన్న దానిపై ప్రభుత్వం శ్వేతపత్రం ఇవ్వాలని హరీష్ కోరారు.కాంగ్రెస్ కు ఓటేస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో
కోదండరాం, ఆకునూరి మురళి, రియాజ్ , బల్మూరి వెంకట్ లు ఊరూరు తిరిగి ప్రచారం చేశారని అన్నారు. ఈ నలుగురికీ ఉద్యోగాలు వచ్చినాయి కానీనిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదని హరీష్ అన్నరు. ఫీజు రియింబర్సు మెంట్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని హరీష్ అన్నారు.
నిరుద్యోగులకు పూర్తి మద్దతు
బీఆర్ ఎస్ పార్టీ ఎల్ల వేళలా నిరుద్యోగులకు అండగా ఉంటుందని హరీస్ రావు హమీ ఇచ్చారు.
శాసనసభలో, శాసన మండలిలో నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తామన్నారు. నిరుద్యోగులకు
మద్దతుగా ప్రత్యక్ష పోరాటం కూడా కొనసాగిస్తామని హరీస్ రావు అన్నారు. రేవంత్ సర్కార్ హామీలు అమలు చేసేదాకా ఈ పోరాటం ఆగదని నిరుద్యోగులకు హరీష్ రావు హామీ ఇచ్చారు.
………………………………………….