
* టెన్త్ విద్యార్థులకు నగదు అందజేత
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి రిటైర్డ్ ఐనా ఉపాధ్యాయురాలు వరలక్ష్మి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆమె ఎక్కువకాలం ఈ పాఠశాలలోనే విధులు నిర్వహించారు.విద్యార్థులంతా తనవారే అనుకునే మనస్తత్వం ఆమెది. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చారు.తాను పనిచేసిన ఈ పాఠశాలలో పదవ తరగతిలో 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి నగదు బహుమతిని ప్రకటించారు. ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులై 500 పైగా మార్కులు సాధించిన 19 మందికి నగదును స్థానిక సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రాజకుమార్ లో చేతుల మీదుగా విద్యార్థులకు నగదును అందజేశారు. 19 మంది విద్యార్థుల్లో పాఠశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు రూ.6,000, రూ.5,000, రూ.4,000 చొప్పున అందించారు. అత్యధిక మార్కులు సాధించి ప్రథమ శ్రేణిలో నిలిచిన రామ హర్షిత్ కు రూ.6,000, ద్వితీయశ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన జాడి రాధికకు 5,000, తృతీయ శ్రేణిలో ఎండీ జాస్మిన్ కు 4,000 అందజేశారు. మిగతా 16 మందికి రూ.1000 చొప్పున అందించారు. ఈ సందర్భంగా సీఐ,ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యంలో చదువుకొని ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులకు నగదు అందజేసేందుకు ముందుకు వచ్చిన వరలక్ష్మి ఉపాధ్యాయురాలు ను ప్రశంసించి ఆమె సేవలను కొనియాడారు. ఉపాధ్యాయురాలును ఆదర్శంగా తీసుకొని విద్యార్థులను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో వారు మంచి మార్కులు సాధించడంతో పాటు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాంబశివరావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
………………………………………….