* అనుకోకుండా కాలు పెట్టిన గిరిజనుడు
* కాలు నుజ్జునుజ్జు.. ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స
* పోలీసుల కోసం మావోయిస్టులు పెట్టినదిగా అనుమానం
ఆకేరు న్యూస్, ములుగు : ములుగు జిల్లాలో మరోసారి మందు పాతర పేలింది. కట్టెల కోసం కొండ పైకి వెళ్లిన గిరిజనుడు అనుకోకుండా మందుపాతరపై కాలు పెట్టడంతో పేలింది. దీంతో అతడికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. తెలంగాణ – ఛత్తీస్గడ్ సరిహద్దు ములుగు జిల్లా (Mulugu District) అడవుల్లోకి 20 రోజులుగా కర్రెగుట్ట సహా సమీప ప్రాంతాల్లోని గుట్టలపై భద్రతా దళాలు తనిఖీలు చేపడుతున్నాయి. ఈక్రమంలో గుట్టపై మావోయిస్టులు ( Maoists)పెట్టిన చాలా మందు పాతరలను నిర్వీర్యం చేశారు. కాగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉన్న వాటిని తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే చలిమెల గుట్లపై పెను ప్రమాదం సంభవించింది. భద్రతా బలగాల లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన చేసిన ఐఈడీ బాంబ్(Ied Bomb) పై కాలుపెట్టిన ఓ గిరిజనుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాలు నుజ్జునుజై గుట్టపైనే చిక్కుకున్న గిరిజనుడిని స్థానికులు జోలే సహాయంతో కిందకు తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్చారు. గాయపడిన వ్యక్తిని ముక్కునూరుపాలెం గ్రామానికి చెందిన సోయం కామయ్యగా గుర్తించారు. వైద్యులు అతడికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
