
* జూలై 19 వ తేదీ నుండి జూలై 26 వ తేదీవరకు ప్రత్యేక ప్యాకేజీ
ఆకేరున్యూస్, హైదరాబాద్: తీర్థ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూలై 19 వ తేదీ నుండి జూలై 26 వ తేదీవరకు ప్రత్యేక ప్యాకేజీని భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్’ ద్వారా హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు IRCTC టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పి.వి. వెంకటేష్ తెలిపారు. యాత్రకి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ప్యాకేజీ వివరాలు:
దివ్యదక్షిణయాత్ర జ్యోతిర్లింగంతో (SCZBG45):(తిరువణ్ణామలై,రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు) ఈ యాత్ర జూలై19 వ తేదీన ప్రారంభమై 26వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టుధర 14100, 3 ఏసీ ధర 22300, 2 ఏసీ ధర 29200 ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి,ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా వెళ్తుంది.
సౌకర్యాలు:
రైలు, బస్సు, హెూటల్, అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, భోజనంమరియు రాత్రి భోజనం), వాటర్ బాటిల్ మరియు టూర్ ఎస్కాట్ సేవలతో సందర్శనాస్థలాలు, (అదనపు ఖర్చు లేదు), ప్రయాణ బీమా అలాగే రైల్వే స్టేషన్ నుండి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగా ఉచితం. ప్రతి రైలు లో 639 మంది ప్రయాణికులుఉంటారు. ప్రతి 70 మందికి ఇద్దరు కోర్డినేటర్లు అందుబాటులో ఉండి అన్ని సౌకార్యాలు సమకురుస్తారు. కోచ్ కి ఒక సెక్యూరిటీ గార్డ్ అలాగే రైలు లో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందని తెలియజేశారు. టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాలకు9701360701,9281495845,9281495843,9281030749 లకు సంప్రదించాలని. మరిన్నివివరణలకు www.irctctourism.com వెబ్ సైట్ ని సంప్రదించాలని తెలిపారు.
…………………………………………………