* సీబీఐ విచారణపై బండి సంజయ్
ఆకేరు న్యూస్, హనుమకొండ : కాళేశ్వరం ప్రాజెక్టు(KALESHWERAM PROJECT)లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణను కోరుతూ రాష్ట్రప్రభుత్వం చేసిన సిఫారసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (BANDI SANJAY) హర్షం వ్యక్తం చేశారు, ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. బీజేపీ పార్టీ ఎప్పటి నుండో సిబీఐ విచారణ కోరుతోందని సీబీఐకు అప్పగించడంలో రాష్ట్ర ప్రభుత్వమే ఆలస్యం చేసిందని బండి సంజయ్ పేర్కొన్నారు. చివరి కాంగ్రెస్ ప్రభుత్వం సత్యానికి తలొగ్గి ఈ నిర్ణయం తీసుకుందని బండి పేర్కొన్నారు.కాళేశ్వరంలో జరిగిన భారీ అవినీతికి బీఆర్ ఎస్ బాధ్యత వహించాలన్నారు. వెంటనే సీబీఐకి లేఖ పంపాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశం ఎప్పటికీ అంతంకాని రోజువారీ సీరియల్ మాదిరిగా కొనసాగుతోందని పేర్కొన్నారు.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
