ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో కొత్త గా పైలెట్ ప్రాజెక్ట్ అంగన్వాడి కేంద్రాల్లో 3 నుండి 6 సంవత్సరాల ప్రీ స్కూల్ పిల్లలకు ప్రతి రోజు 100 మి.లీ. పాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో సోమవారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటిడిఏ పి.ఓ. చిత్ర మిశ్రా, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్. మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి లతో కలసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారంలో మార్పులు చేసి పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి నాణ్యతమైన ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. అంగన్వాడీ టీచర్లకు,హెల్పర్లకు నూతన యూనిఫాంలు అందించామని అన్నారు .ములుగు జిల్లాలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి సీతక్క అన్నారు.
ఈ కార్యక్రమంలో డి డబ్ల్యూ ఓ తుల రవి, సి డి పి ఓ శిరీష, అంగన్వాడి టీచర్లు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, ప్రీ స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

………………………………………..
