* విలువైన పత్రాలు.. కంప్యూటర్లు.. ఏసీలు బూదిద
ఆకేరు న్యూస్, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో బ్యాంక్లో అగ్ని ప్రమాదం సంభవించింది. జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లోని తెలంగాణ గ్రామీణ రీజనల్ బ్యాంకులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బ్యాంకులోని కంప్యూటర్లు, ఏసీలతో పాటు విలువైన పత్రాలన్నీ కాలి బూడిదయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. బుధవారం రాత్రి గ్రామీణ బ్యాంక్ లోపలి నుంచి పొగలు వచ్చాయి. తర్వాత మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. దాదాపు రెండుగంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. బ్యాంకు అధికారులు సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను పూర్తిగా ఆర్పి వేసిన అనంతరం పోలీసులు, బ్యాంకు సిబ్బంది పరిశీలించారు. బ్యాంకులో పని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో 25 కంప్యూటర్లు, 7 ఏసీలతో పాటు పలు విలువైన డాకుమెంట్స్ సైతం కాలిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. బ్యాంకు మేనేజర్ వారణాసి రంజిత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.
………………………………………….
