* 2019లో చేపట్టిన గ్రూప్-2 నియామకాలను రద్దు చేసిన సింగిల్ బెంచ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గ్రూప్-2 పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. 2015-16లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షను ఇటీవల న్యాయమూర్తి నగేష్ భీమపాక నేతృత్వంలోని హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల సమయంలో హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని పేర్కొంది. టీజీపీఎస్సీ పరిధి దాటి వ్యవహరించిందని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. వైట్నర్, దిద్దుబాటు ఉన్న ప్రశ్నప్రత్రాలను మూల్యంకనం చేయడంపై హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. తిరిగి మూల్యాంకనం చేయాలని బోర్డును ఆదేశించారు. ఆ తర్వాత మళ్లీ అర్హుల జాబితాను ప్రకటించాలని చెప్పారు. ఎనిమిది వారాల్లోగా ప్రక్రియ ముగించాలని సూచించారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ పలువురు సీజే ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు ఇరువర్గాల వాదనలు విన్న సీజే ధర్మాసనం సింగిల్ జడ్జి ఆదేశాలను పక్కన పెట్టింది. తాజాగా సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఆసక్తిగా మారింది.
………………………………………….
