* కేసులు నమోదు చేస్తున్న పోలీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 12, 13 తేదీల్లో (డిసెంబర్ 2025) నిర్వహించిన 48 గంటల ‘స్పెషల్ డ్రైవ్’లో మొత్తం 460 మంది వాహనదారులు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో అత్యధికంగా 350 మంది ద్విచక్ర వాహనదారులే కావడం గమనార్హం. వీరితో పాటు 25 మంది ఆటో డ్రైవర్లు, 85 మంది కారు/ఇతర వాహనాల డ్రైవర్లపై కేసులు నమోదయ్యాయి.
బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (BAC) స్థాయిల ఆధారంగా పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి:
30 – 50: 98 కేసులు
51 – 100: 185 కేసులు
101 – 150: 99 కేసులు
151 – 200: 48 కేసులు
201 – 250: 16 కేసులు
251 – 300: 10 కేసులు
300 పైన: 04 కేసులు
’జీరో టోలరెన్స్’ పాటిస్తాం:
మద్యం తాగి వాహనాలు నడిపే వారి విషయంలో ‘జీరో టోలరెన్స్’ (సహించేది లేదు) విధానాన్ని అవలంబిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ రానున్న రోజుల్లోనూ కొనసాగుతుందని హెచ్చరించారు. వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
……………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
