Congress Telangana Strategy Meeting
అకేరు న్యూస్హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో అజేయమైన శక్తిగా తీర్చిదిద్దడమే కాకుండా, కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ‘గాంధీ భవన్’లో జరిగిన కీలక సమావేశంలో ఆయన పార్టీ భవిష్యత్తు వ్యూహాలను ఖరారు చేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొని, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దిశానిర్దేశం చేశారు.
* పార్టీ పటిష్టతకు పంచసూత్ర వ్యూహం
పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసేందుకు ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి, ఈ క్రింది నియామకాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఓటర్ల నమోదు మరియు బూత్ స్థాయిలో పార్టీ పట్టు పెంచేందుకు బూత్ లెవల్ ఏజెంట్ల నియామకం చేయాలని అన్నారు. అలాగే జిల్లాల్లో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు సమర్థవంతమైన నాయకత్వం ఉండాలన్నారు , ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడేలా కమిటీల బలోపేతం చేయాలి . పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించేలా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలి . ప్రభుత్వం మరియు పార్టీ మధ్య వారధిలా పనిచేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించడం. ప్రజా సంక్షేమమే పరమావధి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాయకులు చురుకైన పాత్ర పోషించాలని మీనాక్షీ నటరాజన్ సూచించారు. మన ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక మార్పులు, అభివృద్ధి పనులను ప్రతి ఇంటికీ వివరించినప్పుడే పార్టీకి తిరుగులేని మద్దతు లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.
* రాబోయే రెండేళ్లు అత్యంత కీలకం*
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత బొద్దురెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తేజిత ప్రసంగం చేశారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన, మహేష్ కుమార్ గౌడ్ గారి సమర్థవంతమైన నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నూతన జవజీవాలను సంతరించుకుంది. మన తదుపరి లక్ష్యం దేశానికి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే. అందుకోసం రాబోయే రెండు సంవత్సరాల కాలం ప్రతి కార్యకర్త, నాయకుడు అంకితభావంతో కష్టపడాలి” అని కోరారు.
తెలంగాణలో రెండవసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇప్పటి నుండే పునాదులు వేయాలని, ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో గడపగడపకూ చేర్చాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఒక ప్రతిన పూని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ సమావేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని క్రమశిక్షణతో కూడిన యంత్రాంగంగా మార్చేందుకు, రాబోయే ఎన్నికల్లో ఘనవిజయం సాధించేందుకు గాంధీ భవన్ వేదికగా నేతలు యుద్ధతంత్రాన్ని సిద్ధం చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
