Telangana SSC results 2026
* ఫలితాల కోసం వెబ్సైట్ లింక్స్ ఇవే
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్ష రాసి, ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. రేపు (ఏప్రిల్ 29న) పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు రేపు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో లేదా విద్యాశాఖ కార్యాలయంలో ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
* మార్చిలో ముగిసిన పరీక్షలు…
ఈ ఏడాది మార్చి 24 నుండి ఏప్రిల్ 2 వరకు జరిగిన పదో తరగతి బోర్డు పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన వెంటనే మూల్యాంకన ప్రక్రియను చేపట్టిన విద్యాశాఖ, రికార్డు స్థాయిలో వేగంగా ఫలితాలను సిద్ధం చేసింది. రేపు ఫలితాల విడుదలతో పాటు ఉత్తీర్ణత శాతం, బాలబాలికల ప్రతిభ వంటి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
* ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి:
ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు ఈ కింది అధికారిక వెబ్సైట్ల ద్వారా తమ మార్కులను చూసుకోవచ్చు:
bse.telangana.gov.in
results.bsetelangana.org
మెమో డౌన్లోడ్ విధానం…
పైన పేర్కొన్న వెబ్సైట్లలో ఏదైనా ఒక దానిని ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో ‘SSC Public Examinations April 2026 Results’ లింక్పై క్లిక్ చేయండి.
మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ‘Get Result’ బటన్ నొక్కండి.
మీ ఫలితం స్క్రీన్పై కనిపిస్తుంది. దాన్ని ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసి భద్రపరుచుకోండి.
ఫలితాల విడుదల సమయంలో వెబ్సైట్లపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రత్యామ్నాయ వెబ్సైట్లను కూడా పరిశీలించవచ్చని అధికారులు సూచించారు.
